బ్రేకింగ్ : మిర్చి కూలీల ఆటోని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

by Sathputhe Rajesh |

కల్లూర్ అంబేద్కర్ నగర్‌కు చెందిన కొంతమంది మహిళలు ప్రతిరోజు మిరపకోతలకు వెళుతూ ఉంటారు.

బ్రేకింగ్ : మిర్చి కూలీల ఆటోని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
X

దిశ, కల్లూరు : కల్లూర్ అంబేద్కర్ నగర్‌కు చెందిన కొంతమంది మహిళలు ప్రతిరోజు మిరపకోతలకు వెళుతూ ఉంటారు. అదే క్రమంలో ఈరోజు కూడా ఏన్కూర్‌లో మిరపకాయలు కోయడానికి 15 మంది ఆటోలో బయలుదేరారు. అతివేగంతో కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న కారు, లారీని ఓవర్ టేక్ చేయబోయి ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటోలో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. 8 మందిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వరమ్మ (40) , వెంకటమ్మ(45) అనే ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Next Story