- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ నెల 9 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్లో మరోసారి పుస్తకాల పండుగ రాబోతుంది. హైదరాబాద్లో ఉన్న ఇందిరాపార్క్ దగ్గర్లోని ఎన్టీఆర్ స్టేడియం పుస్తక ప్రదర్శనకు మరోసారి వేదిక కానుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ సాహిత్యాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పుస్తక పఠనం చేయించాలనే ప్రధాన ఉద్దేశంతో ‘బాల మేళా’ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గతంలో 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనకు గతంలో మంచి స్పందన లభించింది.
Next Story