నేటి నుంచి బోనాల పండుగ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

by Disha Web Desk 4 |
నేటి నుంచి బోనాల పండుగ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో బోనాల పండగ నేటి నుంచి షురూ కానుంది. ఇవాళ లంగర్ హౌస్‌లో తొట్టెట ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ సమర్పించనున్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల్లో భాగంగా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీలో జులై 16న బోనాల పండుగ ప్రారంభం కానుంది.



Next Story