కవిత సమాధానం చెప్పి తీరాల్సిందే: తరుణ్ చుగ్

by Disha Web Desk 2 |
కవిత సమాధానం చెప్పి తీరాల్సిందే: తరుణ్ చుగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సోనియా గాంధీ, కేసీఆర్ ఎవరైనా దర్యాప్తు సంస్థలకు సమానమే అని అన్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికారులకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే అని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed