బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

by Dishafeatures2 |
బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై ఆమె సంజయ్, లక్ష్మణ్ కు అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ బీసీలకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేషన్ తో న్యాయం చేస్తామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ డిక్లరేషన్ లో ప్రకటించిన అంశాలన్నింటినీ తప్పక అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నామమాత్రంగా మారిన బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడం కమిషన్ ను పటిష్ట పరచడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీసీ జనాభా అధారంగా బడ్జెట్ కేటాయింపులు, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఆర్థికసాయం వంటివన్నీ వెనకబడిన వర్గాలకు మేలు చేస్తాయని డీకే అరుణ పేర్కొన్నారు.

Next Story

Most Viewed