నడ్డా పర్యటనలో మార్పులు.. మోడీ సభ కారణంగా రీషెడ్యూల్

by Dishafeatures2 |
jp nadda
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 9వ తేదీన తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో 11 రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వాస్తవానికి ఈ మీటింగ్ ఈనెల 8వ తేదీన ఉండాల్సింది.

కానీ ప్రధాని మోడీ తెలంగాణ టూర్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని 9వ తేదీకి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ 11 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన స్టేట్ ప్రెసిడెంట్లు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ మీటింగ్ కీలకంగా మారనుంది. ఎలక్షన్ కు సంబంధించిన వ్యూహరచనపైనే ప్రధానంగా ఈ సమావేశం జరగనుంది.

Next Story