- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే బెటర్: MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు హాజరై అర్వింద్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ మేలు అని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదేండ్లు కొట్లాడాడు.. అప్పడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేస్తే.. ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో తెలంగాణను పెట్టినట్లేనని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రేవంత్ రెడ్డి హోల్ సేల్గా అమ్మేస్తాడని విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి సంచులను మోసుకెళ్లాడు.. ఆ కేసును సీఎం కేసీఆర్ కాపాడుతున్నాడని విమర్శించారు.