CM రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పెషల్ రిక్వెస్ట్

by Disha Web Desk 2 |
CM రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్ లా మారొద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి పొగడడంపై సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఆయన కూడా కేసీఆర్‌లా మారొద్దని రేవంత్‌కు సూచించారు. తొలుత మోడీని పొగిడిన కేసీఆర్.. తర్వాత ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని ఆయన గుర్తుచేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయనేది రేవంత్ చూసుకోవాలని, అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క తెలంగాణకే ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకోవాలన్నారు.

తెలంగాణలో అభివృద్ధి కేంద్రం వల్లే సాధ్యమని రాజాసింగ్ తెలిపారు. కేంద్రం నుంచి ఏమీ రాలేదని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ వచ్చారని, కానీ వారు మాత్రం పెద్ద పెద్ద స్కామ్స్ చేశారని, ఎన్నో డబ్బులు తిన్నారని ఆరోపణలు చేశారు. గత పదేళ్ళలో మోడీ రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుల లెక్కను సీఎం రేవంత్ ప్రజలకు తెలియజేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తెలంగాణకు ఎన్ని నిధులు కావాలన్నా.. ఇచ్చేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారని రాజాసింగ్ తెలిపారు.



Next Story

Most Viewed