బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ నేతల ఘన స్వాగతం

by Ramesh Naini |

బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ నేతల ఘన స్వాగతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న (Telangana Liberation Day) తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పాల్గొననున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు మంగళవారం చేరుకున్నారు. ఆయనకు బీజీపీ జాతీయ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్టీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి కొమురయ్య, జిల్లా కలెక్టర్, అధికారులు, ఆహ్వానం పలికారు. పరేడ్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా జాతీయ జెండా ఎగుర వేయనున్నారు.

Next Story