తెలంగాణలో బీజేపీ ఫోకస్.. ఖమ్మం, నాగర్ కర్నూల్‌లో సభలు!

by Disha Web Desk 21 |
తెలంగాణలో బీజేపీ ఫోకస్.. ఖమ్మం, నాగర్ కర్నూల్‌లో సభలు!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టింది. మోదీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలరే రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కమలం అగ్రనేతలు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత.. ఇక తెలంగాణ నుంచే దండయాత్ర మొదలు పెట్టింది. రెండు సీట్లతో ప్రయాణం మొదలుపెట్టి.. రాజకీయాల్లో వన్ అండ్‌ ఓన్లీ వన్ గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ నెలలో ముగ్గురు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దక్షిణ తెలంగాణలో నల్లగొండ లేదా ఖమ్మం జిల్లాలో ఏదో ఒక చోట సభ నిర్వహించాలని పార్టీ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూల్‌లోనూ సభ పెట్టాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed