కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు: MLA రోహిత్ రెడ్డి

by Disha Web Desk 2 |
కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు: MLA రోహిత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్‌ను ఇరికించాలని జైలు పక్షితో చిలుక పలుకులు పలికించారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, ‘15 కేజీల ఘీ’ కోడ్ నేమ్ పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇచ్చిన సూచన మేరకు రూ. 15 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఇచ్చినట్లు తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ శుక్రవారం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీసు వద్ద రూ. 15 కోట్లు డెలివరీ చేశాను. బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసి ఉన్న రేంజ్ రోవర్ 6060 కారులో ప్రస్తుత లిక్కర్ స్కాం కేసు నిందితుల్లో ఒకరైన ‘ఏపీ’ అనే వ్యక్తికి ఆ డబ్బులు డెలివరీ చేశాను.’’ అని లేఖలో పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై గులాబీ బాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కేటీఆర్​ టూర్ వాయిదా.. జైపాల్​ యాదవ్​ వైఫల్యమేనా..?

Next Story

Most Viewed