- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్..ఆ రెండు కేసులు కొట్టివేత
సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్లో నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్లో నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. 2021లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో ఈ కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.






