అమిత్ షాకు తప్పిన ప్రమాదం.. అద్దాలు పగలగొట్టిన 'షా ' భద్రతా సిబ్బంది

by Dishanational2 |
అమిత్ షాకు తప్పిన ప్రమాదం.. అద్దాలు పగలగొట్టిన షా  భద్రతా సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రమాదం తప్పింది. పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి, మంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించిన విషయం తెలిసిందే.

అయితే ప్రసంగం అనంతరం షా హరిత ప్లాజాకు పయనమయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా కాన్వాయ్‌కి ఓ గుర్తు తెలియని వాహనం అడ్డుగా వచ్చి, నిలుచుంది. ఎంతకూ కారు పక్కకు జరగకపోవడంతో, ఆగ్రహానికిలోనైన అమిత్ షా భద్రతా సిబ్బంది.. ఆ కారు వెనుక అద్దం పగలగొట్టారు. దీంతో షాకైన బీజేపీ నేతలు, టీఆర్ఎస్ పథకంలోనే భాగంగా ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు కారుకు అడ్డుగా ఎవరు వచ్చారు. ఎందుకు ఈ పనిచేశారు అని తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో కారులో ఉన్న వ్యక్తి ఎలాంటి ప్రశ్నలకు సమాధనం ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ ఎస్ వ్యూహానికి మరింత అజ్యం పోసినట్లు అవుతోంది. ఇక ప్రస్తుతం అమిత్ షా హరిత ప్లాజాకు చేరుకొని, బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు.

Also Read: వేడుకలు నిర్వహించాలంటే భయపడుతున్నారు.. కేసీఆర్ పై అమిత్ షా ఫైర్



Next Story

Most Viewed