బిగ్ బ్రేకింగ్ : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ (వీడియో)

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. నాంపల్లిలో ప్లాట్ ఫాంను చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణీకులకు గాయాలు అయినట్లు తెలిసింది. వీరిని హుటాహుటిన లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed