అశావహులకు బిగ్ అలర్ట్.. మద్యం టెండర్లకు సర్కార్ సమాయత్తం!

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి రాజకీయ వర్గాలలో చర్చ మొదలయ్యింది.

అశావహులకు బిగ్ అలర్ట్.. మద్యం టెండర్లకు సర్కార్ సమాయత్తం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి రాజకీయ వర్గాలలో చర్చ మొదలయ్యింది. 2025–27 సంవత్సరంలో ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు ప్రస్తుత ఆగస్టులోనే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తున్నది. మూడు నెలల ముందుగానే దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మద్యం దుకాణాల నిర్వహకులు అలెర్ట్ అయ్యారు. నాడు 2023లో నవంబర్ 30 వరకు గడువున్నా ఆగస్ట్ 4వ తేదీన ప్రక్రియ ప్రారంభించి, ఆగస్టు 18వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. 2,620 మద్యం దుకాణాలకు ఆగస్టు 21వ తేదీన లాటరీ ప్రక్రియ నిర్వహించారు.

మద్యం దుకాణాల ఏర్పాటుపై రగడ

మద్యం దుకాణాలకు ముందస్తు టెండర్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం బయటకు రావడంతో, కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొనేందుకు అప్రమత్తమయ్యింది. 2023–25లో మ్యదం టెండర్లను నాటి ప్రభుత్వం నాలుగు నెలల ముందే ఎందుకు నిర్వహించిందని అధికార పార్టీ నేతలు గత పాలకులను ప్రశ్నిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరుణంలో హడావుడిగా టెండర్లు ప్రక్రియ ప్రారంభించి, లాటరీ ప్రక్రియ నిర్వహించింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ పారదర్శంగా నిర్వహిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మద్యం టెండర్ల పై మాట్లాడే హక్కు గత పాలకులు కోల్పోయారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

2025–27లో మద్యం దుకాణాలు పెరిగే అవకాశమున్న ఏరియాలు

రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రాంతాల సంఖ్య పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మారుస్తూ ప్రభుత్వం ఫిబ్రవరిలో గెజిట్‌ విడుదల చేసింది. స్టేషన్‌ఘన్‌పూర్‌, కేసముద్రం, ఎదులాపురం, అశ్వరావుపేట్‌, చేవెళ్ల, మొయినాబాద్‌, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్‌, దేవరకద్ర, మద్దూరు, పరకాల మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి. రూరల్ ఏరియా ప్రాంతాలను మున్సిపాలీటీలుగా గుర్తించడంతో ఈ ప్రాంతాలలో గతంలో కంటే మద్యం దుకాణాల పెరిగే అవకాశం ఉంది. 2023–25లో 2620 మద్యం దుకాణాలకు ఒక లక్ష 32వేలలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎక్సయిజ్ శాఖకు యాన్యవల్ ఫీజ్ తో కలిపి రూ. 2,460కోట్లు ఆదాయం సమకూరింది. 2019లో దరఖాస్తుల ద్వారా రూ.975 కోట్లు ఆదాయం రాగా, 2021లో 67వేల 849 దరఖాస్తులు రావడంతో రూ.1357 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

2023–25 జిల్లాల వారీగా మద్యం షాపుల మొత్తం సంఖ్య 2,620

అదిలాబాద్ 40

అసిఫాబాద్ 32

మంచిర్యాల 73

నిర్మల్ 47

హైదరాబాద్ 80

సికింద్రాబాద్ 99

జగిత్యాల 71

కరీంనగర్ 94

పెద్దపల్లి 77

సిరిసిల్ల 48

ఖమ్మం 122

కొత్తగూడెం 88

గద్వాల్ 36

మహబూబ్ నగర్ 90

నాగర్ కర్నూల్ 67

వనపర్తి 37

మెదక్ 49

సంగారెడ్డి 101

సిద్దిపేట 93

నల్గొండ 155

సూర్యాపేట 99

భువనగిరి 82

కామారెడ్డి 49

నిజామాబాద్ 102

మల్కాజ్ గిరి 88

మేడ్చల్ 114

సరూర్ నగర్ 134

శంషాబాద్ 100

వికారాబాద్ 59

జనగాం 47

భూపాలపల్లి 60

మహబూబాబాద్ 59

వరంగల్ రూరల్ 63

Next Story