ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న సస్పెండ్.. 48 గంటల పాటు జైలులో ఉండటంతో వేటు

by Disha Web Desk 13 |
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న సస్పెండ్.. 48 గంటల పాటు జైలులో ఉండటంతో వేటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న(గతంలో ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ)ను సస్పెండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరు 48 గంటల పాటు జైలులో ఉండటంతో ప్రభుత్వం వీరిపై వేటు వేసింది. ఈ మేరకు ఈ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని గత వారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి వీరు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నారు. కాగా తిరుపతన్న, భుజంగరావులు ప్రస్తుతం కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Next Story

Most Viewed