- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహా న్యూస్ ఛానెల్ కార్యాలయానికి భట్టి విక్రమార్క
మహా న్యూస్ ఛానల్ పై ఇవాళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. మిట్ట మధ్యాహ్నం... ఛానల్ పై గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల

దిశ, వెబ్ డెస్క్ : మహా న్యూస్ ఛానల్ పై ఇవాళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. మిట్ట మధ్యాహ్నం... ఛానల్ పై గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కండువా వేసుకొని మరి.. దాడి చేసినట్లు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మహా న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Deputy Chief Minister Bhatti Vikramarka ) కూడా రంగంలోకి దిగారు. మహా న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలియగానే... హుటాహుటిన బయలుదేరారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆయనతోపాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా వచ్చారు.
అక్కడ జరిగిన.. దాడి సంఘటన గురించి... మహా న్యూస్ ఛానల్ ( Maha News Channel) సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి. ఇక అంతకుముందు.. తెలంగాణ బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా.... సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ జరిగిన పరిస్థితిని పరిశీలించి.. దాడిని ఖండించారు పొన్నం ప్రభాకర్. ఛానల్ పై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి గా పేర్కొంటూ ఫైర్ అయ్యారు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar ).
Twitter link
మహాన్యూస్ ఆఫీసుపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
— BIG TV Breaking News (@bigtvtelugu) June 28, 2025
మీడియాలో వచ్చే కథనాలు, ప్రసారాలపై అభ్యంతరాలు ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు
కానీ ఇలా దాడి చేయడం ప్రజాస్వామ్య విధానం కాదు
హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి… https://t.co/JMK044EoVR pic.twitter.com/Z1zRnH2Wj4






