రాజ్యాంగాన్ని మార్చేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్ర: భట్టి ఫైర్

by Disha Web Desk 19 |
రాజ్యాంగాన్ని మార్చేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్ర: భట్టి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను కాంగ్రెస్ పార్టీ తరపున తిప్పికొడతామని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన భట్టి.. రాజ్యాంగం, కాంగ్రెస్ ఈ రెండింటి మూల సిద్ధాంతాలు ఒకటేనని, దేశ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను మోడీ సర్కార్ హరిస్తోందని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ అరాచకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా భట్టి సూచించారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందన్నారు.

Next Story

Most Viewed