కేసీఆర్ ట్వీట్‌పై భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్!

by Disha Web Desk 14 |
కేసీఆర్ ట్వీట్‌పై భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం నిన్న సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ట్వీట్ వేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు కరెంటు పోయిందని ప్రతిపక్ష నేత కేసీఆర్ ట్విట్టర్‌లో చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమన్నారు. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగింది అది డిజిటల్ మీటర్‌లో ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే రీడింగ్ చేస్తుందని పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నమోదు చేసిన రీడింగ్, పరిసర ప్రాంత ప్రజల ఇళ్లలో ఎలాంటి కరెంటు కోతలు జరగలేదన్నారు.

నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది అని అధికారులు నిర్ధారించారని వెల్లడించారు. కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటీవల సూర్యాపేట పట్టణంలో సైతం ఇదే తరహాలో విద్యుత్ శాఖను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించి అబాసు పాలయ్యారని పేర్కొన్నారు. అధికారం చేజారి, బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో అబద్దాలతో, అసత్య ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.



Next Story

Most Viewed