రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగవైభవంగా, పండుగ వాతావారణంలో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. 2014 జూన్ 2న దేశంలో 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థులు కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని అన్నారు. ఒకనాడు వెనకబాటుకు గురయిన తెలంగాణ నేడు సమస్త రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలవడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. మున్నెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలని,’ అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, ఈ దిశగా దేశ ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని సిఎం పేర్కొన్నారు. ప్రతి వొక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమిదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందరకర సమయంలో తమ సంతోషాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములై రాష్ట్ర ప్రజలందరూ వాడ వాడనా సంబురాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed