ప్రిన్సిపాల్ను బదిలీ చేయాలని విద్యార్థుల ఆందోళన

by Dishafeatures2 |
ప్రిన్సిపాల్ను బదిలీ చేయాలని విద్యార్థుల ఆందోళన
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని తెలంగాణ బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసును వెంటనే బదిలీ చేయాలంటూ ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు కొందరు తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఒక విద్యార్థినిని ప్రిన్సిపాల్ శ్రీనివాసు కొట్టాడని అందుకు ఆయనను విధులనుoచి తొలగించాలని విద్యార్థులు పాఠశాల నుంచి ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేరుకొని విద్యార్థులు బైఠాయించి ఆందోళన దిగారు. ప్రిన్సిపాల్ ను వెంటనే బదిలీ చేయాలని నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ లో లేరు. బెల్లంపల్లి ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, తాళ్ల గురజాల ఎస్సై నరేష్, టూ టౌన్ ఎస్ఐ రవికుమార్, వన్ టౌన్ ఎస్హెచ్ఓ శంకరయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వివరాలు తెలుసుకున్న ఎంఈఓ, పోలీస్ అధికారులు విద్యార్థులకు నచ్చచేప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్ ను బదిలీ చేస్తేనే ఆందోళన విరమించుకుంటామని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు. అంతటితో ఆగకుండా క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. విద్యార్థుల ఆందోళన వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ మహేష్ రెడ్డి, పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.


Next Story

Most Viewed