క్రికెట్ అభిమానులారా జాగ్రత్త.. క్లిక్ చేస్తే మీ జేబులు గుల్ల!.. సజ్జనార్ ట్వీట్

by Disha Web Desk 5 |
క్రికెట్ అభిమానులారా జాగ్రత్త.. క్లిక్ చేస్తే మీ జేబులు గుల్ల!.. సజ్జనార్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, క్రికెట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సైబర్ నేరాగాళ్లు ఐపీఎల్ టికెట్లు కావాలా? అని సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పోస్టు చేస్తున్నారని హెచ్చరిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. క్రికెట్ అభిమానులారా.. జాగ్రత్త! ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ రీల్స్‌, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి అన్నారు. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ కి విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, ఇలాంటి పోస్టుల పట్ల క్రికెట్‌ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ లింక్‌లపై అసలే క్లిక్‌ చేయొద్దని, క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు గుల్లవుతుంది.. జాగ్రత్త! అని క్రికెట్ అభిమానులను హెచ్చరించారు.



Next Story

Most Viewed