మల్లికార్జున ఖర్గేతో బీసీ సంఘాల నేతలు భేటీ

by Gantepaka Srikanth |

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు.

మల్లికార్జున ఖర్గేతో బీసీ సంఘాల నేతలు భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, జాతీయస్థాయిలో కులగణన జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వినతిపత్రం అందించారు. అనంతరం జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని వెల్లడించడం బీసీల పోరాట విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును కేంద్రం ఆమోదించి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు పెంచేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

Next Story