- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోయిన గాంజా బ్యాచ్! కత్తులతో దాడి చేయడంతో..
రాజేంద్రనగర్లో గాంజా బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాజేంద్రనగర్లో గాంజా బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. టార్గెట్ గా చేసుకున్న రౌడీషీటర్ పై కత్తులతో విరుచుకు పడింది. కష్టం మీద తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రాజేంద్రనగర్ ప్రాంత నివాసి సోహైల్ రౌడీషీటర్. అదే ప్రాంతంలో ఉంటూ గంజాయికి అలవాటు పడ్డ హుస్సేన్తో అతనికి విభేదాలున్నాయి. ఈ క్రమంలో సోహైల్ బైక్ మీద వస్తుండగా కళ్లల్లో కారం చల్లి అడ్డగించిన హుస్సేన్ తన అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేసి మూడు చోట్ల పొడిచాడు. కష్టం మీద తప్పించుకున్న సోహైల్ పోలీస్ స్టేషన్ వెళ్లి హుస్సేన్, మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






