- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: మావోయిస్టు నెట్వర్క్ కూలిపోతోంది
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ(Maoist Party) అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ(Maoist Party) అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘అమిత్ షా దృఢమైన సంకల్పానికి ఇది నిదర్శనం. అమిత్ షా అనుకున్నట్లు 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతం కావడం ఖాయం. అంతర్గత భద్రత పట్ల అమిత్ షా రాజీలేని వైఖరి, దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన మాటలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పడానికి ఈ లొంగుబాటులే నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో శాంతి, భద్రత మరియు అభివృద్ధికి ఇచ్చిన హామీలను సాకారం చేస్తోంది. ఇకనైనా మావోయిస్టులు ఆయుధాలను వదిలి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు నెట్వర్క్ కూలిపోతోంది.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పారు.






