‘ఎందరో అమరుల త్యాగ ఫలం.. ఇంకెందరో బిడ్డల బలిదానం’

by Disha Web Desk 2 |
‘ఎందరో అమరుల త్యాగ ఫలం.. ఇంకెందరో బిడ్డల బలిదానం’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ పోస్టు పెట్టారు. ‘ఎందరో అమరుల త్యాగ ఫలం.. ఇంకెందరో బిడ్డల బలిదానం.. సబ్బండ వర్ణాలేకమై నినదించిన గళం, నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితం మన తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు.

Read More... బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం: బండి సంజయ్


Next Story

Most Viewed