- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Bandi Sanjay: చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: ‘కాంగ్రెస్ (Congress) తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లుగా ఉంది’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం (Telangana BJP) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో కలిసి బండి సంజయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని, ఆయనపై కుట్ర చేసి రెండు సార్లు ఓడించిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయననను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రదానం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. అలాంటి పార్టీ ఇవాళ అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించాలనడం సిగ్గుచేటని, తక్షణమే బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
అంబేద్కర్ ఆయన జీవితం మనందరికీ స్పూర్దిదాయకమన్నారు. ఒక్కపూట తింటూ ఉన్నత చదువు కోసం తన పదేళ్ల జీవితాన్ని బరోడా మహారాజ్ వద్ద పణంగా పెట్టి చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహోన్నతుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ భిక్షవల్లే ప్రధాని కాగలిగానని మోడీ అన్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు బీజేపీ కృషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోడీదే.. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ క్రుషితోనే అంబేద్కర్కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చిందన్నారు. అంబేద్కర్ జీవితమే మాకు స్ఫూర్తి.. అంబేద్కర్ స్మారక స్టాంపులు, బిల్లుల విడుదల. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో శక్తివంతమైన సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.