కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్

by Disha Web Desk 2 |
కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో న్యాయం దొర గడీల్లో నలిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశంలో అత్యధిక వేతనం(రూ.4 లక్షలు) తీసుకుంటున్న సీఎం కేసీఆరేనని అన్నారు. ఇక ఆయన తనయుడు కేటీఆర్ పరువు నష్టం విలువ రూ.100 కోట్లు అంటూ బండి చురకలంటించారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వాచ్ ధర రూ.20 లక్షలుగా ఉందన్నారు. మరి కుక్కల దాడిలో మరణించిన పిల్లల కుటుంబాలు, ర్యాగింగ్ భూతానికి బలైన బాధితురాలు, టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వళ్ల నష్టపోయిన వారి విలువ ఎంతో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు.



Next Story