Bandi Sanjay :ఖమ్మం సభ వాయిదా.. యథావిధిగా నాగర్ కర్నూల్ సభ

by Dishafeatures2 |
Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లాలో గురువారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బిపర్ జాయ్ తుపాన్ ఎఫెక్ట్ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఉందన్నారు. అందుకే ఎన్డీఆర్ఎఫ్ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్ షా పై ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే సభను వాయిదా వేస్తున్నామన్నారు.

ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ వద్దనుకుని వాయిదా వేసినట్లు చెప్పారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించడం గ్యారెంటీ అని, కార్యకర్తలు నిరాశ చెందవద్దని సంజయ్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న నడ్డా సభ యథావిధిగా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. మోడీ టూర్ ఎప్పుడు అన్న అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని, త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు.



Next Story