బీజేపీ ఆ నిర్ణయంపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

by Dishafeatures2 |
Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి డీకే అరుణకు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, బండి సంజయ్ కు జనరల్ సెక్రటరీ, సత్యకుమార్ కు సెక్రటరీ పదవులు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న తనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా గర్వంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్రానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, ప్రత్యేకంగా కరీంనగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. పార్టీకి, ప్రజలకు అంకితభావంతో సేవ చేసేందుకు ప్రయత్నాస్తానని అన్నారు.

Next Story

Most Viewed