తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమే

by Disha Web Desk 2 |
తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమే
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కామెంట్స్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు పట్టిన దరిద్రమే కేసీఆర్ కుటుంబం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పట్టిన దరిద్రం వదిలించేందుకే బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. కారు పోయింది సర్వీసింగ్‌కు కాదని.. షెడ్డుకే పోయిందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.

మీ అరాచకాలు, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీయే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కారు రిపేర్‌కు కూడా పనికిరాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదని సెటైర్ వేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని సవాల్‌ విసిరారు. రాబోయే ఎన్నికల్లో మోడీ చేసిన అభివృద్ధి, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెబుతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ది మూడో స్థానమే రాసి పెట్టుకోండి అని చెప్పారు.



Next Story

Most Viewed