సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య, పీవీ సింధు

by Disha Web Desk 19 |
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య, పీవీ సింధు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విరివిరిగా కలిశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వారితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీవీ సింధు తల్లిదండ్రులు, ఇతరులు ఉన్నారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సీపీఎం నేతలు కూడా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఇవాళ సీఎంని అక్కినేని నాగార్జున దంపతులు ఉదయం కలిసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed