‘బలగం’ మొగిలయ్యకు కొనసాగుతున్న ట్రీట్‌మెంట్

by Sathputhe Rajesh |

మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో బలగం మొగిలయ్యకు నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది.

‘బలగం’ మొగిలయ్యకు కొనసాగుతున్న ట్రీట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో బలగం మొగిలయ్యకు నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయాయి.

కాగా మొగిలయ్య ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటన్నారు. ఛాతి నొప్పి రావడంతో వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య లేదని నిమ్స్ వైద్యలు నిర్ధారించారు. డయాలసిస్ కొనసాగిస్తూనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ వైద్యులు వెళ్లడించారు.

Next Story