మిషన్​భగీరథ నిధులు మింగారు.. ఎమ్మెల్యే ఆరూరిపై బక్క జడ్సన్ ​ఈడీకి ఫిర్యాదు

by Disha Web Desk 19 |
మిషన్​భగీరథ నిధులు మింగారు.. ఎమ్మెల్యే ఆరూరిపై బక్క జడ్సన్ ​ఈడీకి ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​మిషన్​భగీరథ నిధులను భారీగా స్వాహా చేశారంటూ సీనియర్​కాంగ్రెస్​నాయకుడు బక్క జడ్సన్​ బుధవారం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్​పర్తి మండలాలు ఉన్న విషయం తెలిసిందే.

కాగా, ప్రజలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్​భగీరథ కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు చేశారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే రమేశ్​భారీ మొత్తంలో కమీషన్లు తీసుకుని.. చాలా వరకు పనులు పూర్తి చేయలేదని బక్క జడ్సన్​తన ఫిర్యాదులో ఆరోపించారు.

2014లో వర్ధన్నపేట స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసినపుడు రమేశ్​తన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ. 14, 94, 52, 206 పేర్కొన్నట్టు తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను రూ. 28, 39, 80, 047 కోట్లుగా తెలియచేశారన్నారు.

ఈ క్రమంలో నాలుగేళ్లలో ఎమ్మెల్యే రమేశ్​ఆస్తులు వంద శాతం పెరిగిన విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఇదే నిదర్శనమన్నారు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు.



Next Story

Most Viewed