బ్యాక్‌ టు యాక్షన్..! రేపు పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో CM రేవంత్ భేటీ

by Kema Shiva Kumar |

విదేశీ పర్యటన ముగిసి నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పుడే పార్టీ, పాలనా వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

బ్యాక్‌ టు యాక్షన్..! రేపు పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో CM రేవంత్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పర్యటన ముగిసి నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పుడే పార్టీ, పాలనా వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన రేపు సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులు, జిల్లాల వారీగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Next Story