BRS వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్..?

by Disha Web Desk 2 |
BRS వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ లోక్‌సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి మరో కీలక వ్యక్తిని బరిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా కేసీఆరే బాబూ మోహన్‌కు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. కాగా, ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీజేపీ నుంచి టికెట్ ఆశించిన బాబూ మోహన్.. టికెట్ రాదన్న విషయం తెలిసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదే కోపంలో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్‌లో పోటీ చేయాలని భావించారు. అయితే, గురువారం రాత్రి బీఆర్ఎస్‌లో జరిగిన అనూహ్య పరిణామల దృష్ట్యా బాబూ మోహన్‌కు కేసీఆర్ ఫోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో ఆయనకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Next Story