రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో మొక్కు తీర్చుకున్న అజారుద్దీన్

by Disha Web Desk 1 |
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో మొక్కు తీర్చుకున్న అజారుద్దీన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీ‌హిల్స్ ఇంచార్జి మహమ్మద్ అజారుద్దీన్ తన మొక్కు చెల్లించుకున్నారు. ప్రముఖ అజ్మీరా దర్గాకు చాదర్ సమర్పించే కార్యక్రమాన్ని ఇవాళ గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా‌దాస్ మున్షితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా అజ్మీర్‌కు తాను చాదర్‌ను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు హామీలను అమలు చేసి.. మహిళల నుంచి కాంగ్రెస్ విశేష ఆదరణ పొందిందని అన్నారు.

రానున్న వంద రోజుల్లో మిగతా హామీలను కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని నిర్వహించిన ప్రజాపాలనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. సుమారు 1.25 కోట్లకు పైగా ప్రజల నుంచి వినతులు అందాయని అన్నారు. వాటి అమలు కోసం మంత్రి వర్గ ఉప సంఘం వేసి త్వరితగతిన పరిష్కరించడానికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ లీడర్ మహమ్మద్ అసదుద్దీన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ ఫహీమ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed