ఆటో బోల్తా.. ఒకరు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
ఆటో బోల్తా.. ఒకరు స్పాట్ డెడ్
X

దిశ, వడ్డేపల్లి : వడ్డేపల్లి మండల పరిధిలో మద్దూరు స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఆటో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే పరమేష్ గౌడ్ సొంత పని నిమిత్తం కర్నూల్ వెళ్లి వస్తుండగా మద్దూరు స్టేజి సమీపంలో ఆటో అదుపుతప్పి రాజోలి మండలం పెద్దతాండ్రపాడు కు చెందిన పరమేష్ గౌడ్ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరమేష్ గౌడ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.


Next Story

Most Viewed