పాతబస్తీలో దారుణం.. మైలార్​దేవ్​ పల్లి పోలీసులపై దాడి

by Disha Web Desk 4 |
పాతబస్తీలో దారుణం.. మైలార్​దేవ్​ పల్లి పోలీసులపై దాడి
X

దిశ, చార్మినార్​ : గోల్డ్​ రీకవరి కోసం పక్కా సమాచారంతో అర్థరాత్రి చార్మినార్​కు వచ్చిన మైలార్​ దేవ్​ పల్లి పోలీసులను రౌండప్​ చేసి చితకబాదిన ఘటన మొఘల్​పురా పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలకం రేపుతుంది. ఛత్రినాక ఇంచార్జి ఏసీపీ జహంగీర్​, మొఘల్​పురా ఇన్​స్పెక్టర్​ శివకుమార్​‌లు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చార్మినార్​ సర్దార్​ మహల్​ ప్రాంతంలో ఒక ఇంట్లో గోల్డ్​ రీకవరి కని పక్కా సమచారంతో ఆదివారం అర్థరాత్రి మైలార్​ దేవ్​ పల్లి డిఐతో పాటు మరో ముగ్గురు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మైలార్​దేవ్​ పల్లి పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వ్యక్తి మైలార్​ దేవ్​ పల్లి పోలీసులు ఇంట్లోకి రాగానే దొంగలు.. దొంగలు అంటూ భీభత్సం సృష్టించాడు. మేము దొంగలం కాదు అని మైలార్​ దేవ్​ పోలీసులు ఐడి కార్డులు చూపెట్టినా రౌండప్​ చేసి చితకబాదారు. ఒక వైపు పోలీసులను చితకబాదుతుండగానే సదరు వ్యక్తి అక్కడి నుంచి ఎస్కేప్​ అయ్యాడు. ఈ ఘటనలో మైలార్​దేవ్​ పల్లి పోలీస్​స్టేషన్​కు చెందిన ఒక డిఐతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 2గంటలకు మైలార్​దేవ్​ పల్లి పోలీసులు మొఘల్​పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘల్​పురా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed