- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఆర్ తాత్కాలిక ఈఎన్సీగా అశోక్
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తాత్కాలిక ఇంజనీరింగ్ ఇన్ ఛీప్ గా ఎన్.అశోక్ నియమితులయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తాత్కాలిక ఇంజనీరింగ్ ఇన్ ఛీప్ గా ఎన్.అశోక్ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. అశోక్ ప్రస్తుతం క్వాలిటి కంట్రోల్ చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈఎన్సీగా ఉన్న కనకరత్నం ఎసీబీ కి పట్టుబడటంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో కొత్తగా అశోక్ నియమితులయ్యారు. అయితే అశోక్కు ఇంఛార్జిగా కానీ ఎఫ్ఏసీగా కానీ పదాన్ని వాడకుండా లుక్ ఆఫ్టర్ అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.
అశోక్ వచ్చే సెప్టంబర్లో రిటైర్ కానున్నారు. అందు కోసమే ఆయనకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించలేదని సమాచారం. ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన అశోక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి, సూరత్లో ఎంటెక్ అభ్యసించారు. 1989లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షలో అర్హత సాధించి పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈ నియమితులయ్యారు.
- Tags
- seethakka






