మోడీ బ్రతికున్నంత వరకూ అది జరగనివ్వరు!.. బండి సంజయ్ మరోసారి క్లారిటీ!

by Disha Web Desk 5 |
మోడీ బ్రతికున్నంత వరకూ అది జరగనివ్వరు!.. బండి సంజయ్ మరోసారి క్లారిటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో అధికార విపక్షాల మధ్య రిజర్వేషన్ల వివాదం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మోడీ బ్రతికున్నంతవరకూ అది జరగదు అంటూ ప్రధాని మోడీ ఓ సభలో రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియోను పోస్టు చేశారు. దీనికి మోడీ బ్రతికున్నంత వరకూ.. ఆదివాసి, దళితులు, ఓబీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లలో అన్యాయం జరగనివ్వను. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ముస్లింలకు పంచనివ్వను!! అంటూ రాసుకొచ్చారు.

కాగా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు ఇచ్చిన మత పరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతుండగా.. బీజేపీ మరో సారి అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను తీసేయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్ షా, ఎంపీ బండి సంజయ్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందనే బీజేపీ ఫిర్యాదు చేయగా.. కొందరు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంలోని సభ్యులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే ఎంపీ బండి సంజయ్ మోడీ చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి రిజర్వేషన్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.


Next Story