కాంగ్రెస్ నాయకుల అరెస్ట్.. రేవంత్ రెడ్డి సీరియస్

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్.. రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేయడం నిజం కాదా అన్నారు. ఇది ఖచ్చితంగా ‘దశాబ్ది దగా’ అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక, ఒక హామీ అయిన పూర్తిగా అమలు చేసారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే మేము ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తమకు ఉందన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు నెరవేరుస్తామన్నారు.

Next Story

Most Viewed