బీసీ గురుకులాల దరఖాస్తు గడువు పెంపు

by Disha Web Desk 2 |
బీసీ గురుకులాల దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆఖరు తేదీని ఈ నెల 14తేదీ వరకు పొడిగించామని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. వరుసగా సెలవులు రావడంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని, విద్యార్ధుల అభ్యర్థన మేరకు దరఖాస్తు తేదీని పొడిగించామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ బీజడ్ సీ, ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్, బీఏ హెచ్ ఈపీ కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్, మెషిన్ లెర్నింగ్, బీబీఏ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియాలజీ, బిజినెస్ అన లిటిక్స్, జియోగ్రఫీ, డాటా సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రి షన్ అండ్, డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 040-23328266, myptbcwreis.telangana.gov.inను సంప్ర దించాలని మల్లయ్య బట్టు సూచించారు.


Next Story