తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన AP మహిళ

by Gantepaka Srikanth |

తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన ఏపీ మహిళ

తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసిన AP మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన లభించింది. ఎక్సైజ్‌(Telangana Excise Department) కమిషనర్‌ కార్యాలయంలో శనివారం చివరి రోజు కావడంతో మహిళా దరఖాస్తుదారులు సందడి చేశారు. నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు రాగా.. ఈ రోజు మరో 20 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం రూ.4 కోట్ల 50 లక్షలు చెల్లించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 23న మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story