బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

by velandi.Saikiran |

ముల్కనూర్ బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మామిళ్ల సందీప్ (సంపత్), చిన్నారి మనకొండూర్ శాంసిక తీవ్రంగా గాయపడ్డారు.

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
X

దిశ, భీమదేవరపల్లి: మండలంలోని ముల్కనూర్ బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మామిళ్ల సందీప్ (సంపత్), చిన్నారి మనకొండూర్ శాంసిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story