AP: అయ్యన్న పాత్రుడికి ఝలక్ ఇచ్చిన ఈసీ.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ

by Disha Web Desk 1 |
AP: అయ్యన్న పాత్రుడికి ఝలక్ ఇచ్చిన ఈసీ.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా నాయకుల కదలికలు, ప్రసంగాలపై ఈసీ పత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు, మత పరమైన ప్రసంగాలు, కుట్రపూరిత ప్రసంగాల ఇస్తున్న నాయకులపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఈసీ టీడీపీ సినీయర్ నేత, పోలీట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు చేశారంటూ అయ్యన్నపై వైసీపీ ఎమ్మల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌‌‌ను ఆదేశించారు.



Next Story

Most Viewed