MLA రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

by Disha Web Desk 4 |
MLA రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మత విద్వేషాలు చెలరేగేలా ప్రసంగించారన్న ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాజస్థాన్ పోలీసులు కేసులు నమోదు చేసారు. మహారాణా ప్రతాప్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల రాజసింగ్ రాజస్థాన్ వెళ్లిన విషయం తెలిసిందే. కున్హాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగా, మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని కున్హాడి పోలీసులు ఐపీసీ సెక్షన్ 153 ఏ ప్రకారం కేసులు పెట్టారు.



Next Story

Most Viewed