ఇక బీజేపీ ఆటలు సాగవు : రేగా కాంతారావు

by Disha Web Desk 4 |
ఇక బీజేపీ ఆటలు సాగవు : రేగా కాంతారావు
X

దిశ, మణుగూరు : దేశంలో ఇక మోడీ ఆటలు సాగవని.. బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ బుద్ధి చెబుతుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు ఆయన అనుచరులదే కీలక పాత్ర అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బీజేపీపై నిప్పులు చెరిగారు.

కేంద్రంలో మోడీ నిరంకుశ పాలన పోవాలంటే.. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రత్యామ్నాయమన్నారు. పేపర్ లీకేజీల వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉందన్నారు. యువతను, విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలన్నారు. లేకుంటే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలువరించే దమ్ము ఎవరికీ లేదన్నారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే ఎక్కడా కూడా తిరగనివ్వమని హెచ్చరించారు.

Next Story

Most Viewed