పరీక్ష రాస్తుండగానే ఇంటర్ విద్యార్థినికి గుండె పోటు..

by Disha Web Desk 19 |
పరీక్ష రాస్తుండగానే ఇంటర్ విద్యార్థినికి గుండె పోటు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్ష రాస్తుండగానే ఓ విద్యార్థిని గుండెపోటుకు గురైంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ ఇంటర్ విద్యార్థిని గురువారం మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో పరీక్ష రాస్తోంది. ఈ సమయంలోనే విద్యార్థిని గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కూతురు గుండెపోటుకు గురైందనే వార్త తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed