అమ్నీషియా పబ్ రేప్ కేసు : హైకోర్టు కీలక నిర్ణయం

by Rajesh |
అమ్నీషియా పబ్ రేప్ కేసు : హైకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకును మైనర్‌గా పరిగణిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు మైనర్లందరినీ మేజర్లుగా పరిగణించాలని గతంలో జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ, జువైనల్ కోర్టులో మేజర్‌గా పరిగణిస్తూ గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జువైనల్ కోర్టు ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ హైకోర్టును ఆశ్రయించగా.. నేడు విచారణ జరిపిన న్యాయస్థానం మైనర్‌గా పరిగణిస్తూ తీర్పు వెల్లడించింది.

Next Story

Most Viewed